
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకులోయలో సీపీఎం వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ‘మీ ఓటు… నోటు’ రెండూ మాకే వేయండి అంటూ సీపీఎం నేతలు భిక్షాటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. ధనార్జన పార్టీలైన టీడీపీ, వైసీపీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గిరిజనుల కోసం అహర్నిశలు కష్టపడే సీపీఎం పార్టీ అభ్యర్థి కే. సురేంద్రను గెలిపించాల్సిందిగా కోరారు. ‘‘మాది పేదల పార్టీ కాబట్టి మీ ఓటుతో పాటు నోటు కూడా వేయాలని ఆశిస్తున్నాము’’ అని సీపీఎం నేతలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.