ఉత్తరప్రదేశ్ : ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగీపై.. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనద్దంటూ ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన గుడుల బాట పట్టారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ గడిపేస్తున్నారు. దీనిలో భాగంగా లక్నోలోని హనుమాన్ సేతు ఆలయాన్ని ఆయన సందర్శించారు.