ఇందిరా గాంధీ హంతకులను ఈ రోజున ఉరితీశారు.. ఇద్దరు అంగరక్షకులు 25 బుల్లెట్లు కాల్చారు.. చరిత్ర ఏంటో తెలుసుకోండి..?

Indira gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసులో ప్రమేయమున్న సత్వంత్ సింగ్, కేహర్ సింగ్‌లను ఈ రోజున ఉరితీశారు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు

ఇందిరా గాంధీ హంతకులను ఈ రోజున ఉరితీశారు.. ఇద్దరు అంగరక్షకులు 25 బుల్లెట్లు కాల్చారు.. చరిత్ర ఏంటో తెలుసుకోండి..?
Indira Gandhi

Updated on: Jan 06, 2022 | 8:03 AM

Indira gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసులో ప్రమేయమున్న సత్వంత్ సింగ్, కేహర్ సింగ్‌లను ఈ రోజున ఉరితీశారు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఇందిరా గాంధీ భద్రతా సిబ్బంది.1984, అక్టోబర్ 31న ఆమె ప్రభుత్వ నివాసంలో ఆమెను కాల్చిచంపారు. ఈ కుట్రలో కేహర్ సింగ్ కూడా ఉన్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇతర భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్‌ను కాల్చి చంపారు. ఇందిర ‘ఆపరేషన్ బ్లూ స్టార్’తో వీరిద్దరూ కలత చెందినట్లు సమాచారం. అయితే ఇందిర షూటింగ్‌లో కేహార్‌కు సంబంధం లేదని, అయితే హత్యకు పథకం పన్నాడని తేలింది. ఇందిరపై కాల్పులు జరపడంతో బియాంత్ సింగ్‌ని అతని భద్రతా సిబ్బంది అక్కడే చంపేశారు.

ఇందిరా గాంధీ 31 అక్టోబర్ 1984న ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అధికారులతో చర్చిస్తుండగా అకస్మాత్తుగా సెక్యూరిటీ గార్డు బియాంత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో ఇందిరా గాంధీపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. సత్వంత్ వెంటనే తన ఆటోమేటిక్ కార్బైన్‌లోని మొత్తం 25 బుల్లెట్లను ఇందిరా గాంధీపై కాల్చాడు. తర్వాత ఇందిరను వెంటనే AIIMS ఆసుపత్రికి తరలించారు. ఆమె సుమారు 4 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు చనిపోయిందని ప్రకటించారు.

ఇందిరపై కాల్పులు జరిపిన తర్వాత బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు ఇతర భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఈ సమయంలో బియాంత్ సింగ్ తప్పించుకునే ప్రయత్నంలో చంపేశారు. సత్వంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీ హంతకులు ఆమె ఆరోపించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం సహాయంతో ఇందిర నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో వందలాది మంది చనిపోయారు.

కేహర్ సింగ్, సత్వంత్ సింగ్‌లకు మరణశిక్ష
సత్వంత్ తో పాటు ఇందిర హత్యకు కుట్ర పన్నిన కేహర్ సింగ్, బల్వంత్ సింగ్ లను విచారించారు. అయితే ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేకపోవడంతో బల్వంత్ సింగ్‌ను విడుదల చేశారు. అయితే ఇందిరపై కాల్పులు జరిపిన సత్వంత్ సింగ్, కుట్రదారు కేహర్ సింగ్‌ను హత్య చేసిన కేసులో దోషిగా పరిగణిస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఇందిర మరణించిన 5 సంవత్సరాల తరువాత సత్వంత్ సింగ్ (54 సంవత్సరాలు) కేహర్ సింగ్ (26 సంవత్సరాలు) తీహార్ జైలులో 6 జనవరి 1989న ఉరితీశారు. తరువాత ఇద్దరి మృతదేహాలను వారి బంధువులకు కూడా ఇవ్వలేదు జైలులోనే వారి అంత్యక్రియలు నిర్వహించారు.

AR Rahman Birthday Special: 3 ఆస్కార్‌ నామినేషన్ల నుంచి 2 గ్రామీ అవార్డ్‌ల వరకు అతడి ప్రయాణం..

PM Modi: ప్రధాని మోదీకి సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ ఏ విధంగా ఉంటుంది..? పర్యటనకు సంబంధించి రాష్ట్రాలు చేయాల్సిన పనేంటి..

Pujara Comments: రెండో టెస్ట్‌లో టీమిండియా గెలుస్తుందా..! వ్యూహం ఏంటి..? పూజారా కామెంట్స్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us