
ఇందిరా గాంధీ నుంచి మథర్ థెరిస్సా వరకు చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళలు వీరే. వీరు వివిధ సమయాల్లో సమాజానికి ఉన్నతమైన సేవలు అందించారు. వీరి అత్యున్నతమైన నాయకత్వం ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టాయి. అలాంటి పవర్ఫుల్ మహిళల్లో కొందరి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఇందిరా గాంధీ భారతదేశానికి మొదటి మహిళా ప్రధాన మంత్రి. ఆమె కాలంలో చేపట్టిన వివిధ సంస్కరణలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ భారత రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతంగా ఎదిగి మంచి పేరుప్రఖ్యాతలు గడించారు.

మదర్ థెరిసా ఎనలేని సేవకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. భారతదేశంలోని పేదలకు సేవ చేస్తూ తన పూర్తి జీవితాన్ని ఆమె గడిపారు.

క్వీన్ ఎలిజబెత్ I ఇంగ్లాండ్ రాణి. ఆమె బ్రిటన్ రాణిగా ఉన్నప్పుడు ఆంగ్లేయులు ప్రపంచం మొత్తాన్ని పాలించారు.

ఎంప్రెస్ డోవగర్ సిషి చైనాలో ప్రభావవంతమైన మహిళ. క్వింగ్ రాజవంశం సమయంలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది.

అడా లవ్లేస్ అనే మహిళ ఓ గణిత శాస్త్రవేత్త. ఆమె ప్రపంచంలోనే మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్గా పని చేశారు.

జోన్ ఆఫ్ ఆర్క్ ఓ ఫ్రెంచ్ మహిళ. ఫ్రెంచ్ సైన్యానికి ఆమె సహకారం ఇప్పటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. ఇంగ్లండ్పై యుద్ధంలో విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది.

మార్గరెట్ థాచర్ బ్రిటన్ మొదటి ప్రధాన మంత్రి. ఆమె రాజకీయ చతురత దేశప్రజలకు అభిమాన నేతగా గుర్తింపు తెచ్చింది.