580 సంవత్సరాల తర్వాత కనిపించే సుదీర్ఘమైన చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..

| Edited By: KVD Varma

Nov 19, 2021 | 8:49 AM

చంద్రగ్రహణం, సూర్య గ్రహణం అనేది అమవాస్య, పౌర్ణమి వంటి ప్రత్యేకరోజులలో ఏర్పడుతాయి. అయితే ఈసారి 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది.

1 / 6
కార్తీక  పౌర్ణమి రోజున.. (నవంబర్ 19న) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది. మనదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే  ఈ గ్రహణకు అనేక ప్రత్యేకతలున్నాయి. 580 ఏళ్ల తర్వాత ఈసారి సుధీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ గ్రహణం దాదాపు మూడున్నర గంటలపాటు ఉంటుంది.

కార్తీక పౌర్ణమి రోజున.. (నవంబర్ 19న) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది. మనదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణకు అనేక ప్రత్యేకతలున్నాయి. 580 ఏళ్ల తర్వాత ఈసారి సుధీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ గ్రహణం దాదాపు మూడున్నర గంటలపాటు ఉంటుంది.

2 / 6
అరుణాచల్ ప్రదేశ్.. అస్సాంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ గ్రహణం కనిపిస్తుందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్స్ డైరెక్టర్ దేబీ ప్రసాద్ దువారీ తెలిపారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని తెలిపారు. తూర్పు హెరిజోన్‏కు అతి సమీపంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత చివరి క్షణాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్.. అస్సాంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ గ్రహణం కనిపిస్తుందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్స్ డైరెక్టర్ దేబీ ప్రసాద్ దువారీ తెలిపారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని తెలిపారు. తూర్పు హెరిజోన్‏కు అతి సమీపంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత చివరి క్షణాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని చెప్పారు.

3 / 6
గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని.. ఇది 580 ఏళ్లలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం అవుతుందని దువారీ చెప్పారు. ఈ గ్రహణం 1440 ఫిబ్రవరి 18న చివరిసారిగా ఏర్పడిందని.. ఆ తర్వాత 2669వ సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇలాంటి ఘటన కనిపించిందని తెలిపారు.

గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని.. ఇది 580 ఏళ్లలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం అవుతుందని దువారీ చెప్పారు. ఈ గ్రహణం 1440 ఫిబ్రవరి 18న చివరిసారిగా ఏర్పడిందని.. ఆ తర్వాత 2669వ సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇలాంటి ఘటన కనిపించిందని తెలిపారు.

4 / 6
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి గ్రహణం కనిపిస్తుందని.. కానీ ఈ ప్రాంతాల నుంచి కొంత సమయం మాత్రమే గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. గరిష్ట పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 2.34 గంటలకు కనిపిస్తుంది. చంద్రునిలో 97 శాతం భూమీ నీడతో కప్పబడి ఉంటుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి గ్రహణం కనిపిస్తుందని.. కానీ ఈ ప్రాంతాల నుంచి కొంత సమయం మాత్రమే గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. గరిష్ట పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 2.34 గంటలకు కనిపిస్తుంది. చంద్రునిలో 97 శాతం భూమీ నీడతో కప్పబడి ఉంటుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంది.

5 / 6
ఈ పాక్షిక  గ్రహణం ఉదయం 11.32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.33 గంటలకు ముగుస్తుందని దువారీ తెలిపారు. సూర్యుడు, భూమి, చంద్రుడు సంపూర్ణంగా ఒకే రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక గ్రహణం మాదిరిగానే నీడ గ్రహణం వాస్తవికంగా ఉంటుందని తెలిపారు.

ఈ పాక్షిక గ్రహణం ఉదయం 11.32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.33 గంటలకు ముగుస్తుందని దువారీ తెలిపారు. సూర్యుడు, భూమి, చంద్రుడు సంపూర్ణంగా ఒకే రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక గ్రహణం మాదిరిగానే నీడ గ్రహణం వాస్తవికంగా ఉంటుందని తెలిపారు.

6 / 6
తర్వాత చంద్రగ్రహణం 2022 మే 16న ఉంటుందని.. ఈ గ్రహణం భారత్ నుంచి కనిపించదని చెప్పారు. భారతదేశం నుంచి కనిపించే చంద్రగ్రహణం నవంబర్ 8న 2022న ఉంటుంది.

తర్వాత చంద్రగ్రహణం 2022 మే 16న ఉంటుందని.. ఈ గ్రహణం భారత్ నుంచి కనిపించదని చెప్పారు. భారతదేశం నుంచి కనిపించే చంద్రగ్రహణం నవంబర్ 8న 2022న ఉంటుంది.