
చాలా మంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలకు నేరుగా కట్చేసి వంట చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆకు కూరలు కొన్ని మట్టిలోపల పండుతాయి. తద్వారా వాటికి మట్టి అంటుకుపోయి ఉంటుంది. వాటిని శుభ్రం చేయకుండా అలానే వండడం ద్వారా ఆ మట్టి, దానిలో ఉండే మలినాలు మన శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారీన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిరి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే కట్చేసి వండుకోవడం ఉత్తమం.

ఆకులను తొలగించండి: మీరు ఆకుకూరలు తెచ్చుకుంటే ముందుగా వాటికి ఉన్న ఆకులను చేతితో తొలగించండి. తర్వాత వాటిన శుభ్రంగా దులపండి. అప్పుడు వాటిలో ఏవైనా పురుగులు ఉంటే కిందపడిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద కుండలో నీళ్ళు నింపి, ఆకుకూరలను కొద్దికొద్దిగా వేసి కడగండి. మొదట సగం ఆకుకూరలను వేసి నీటిలో 3-4 సార్లు కడగండి. దీనివల్ల దుమ్ము, మురికి పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత దానిని కట్చేసి వండుకోండి

బేకింగ్ సోడా: కూరగాయల ఆకులకు అంటుకున్న పురుగులను తొలగించాలనుకుంటే, నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు ఆకుకూరలను అందులో వేసి 15 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత వాటిని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడగండి. పురుగులు సులభంగా ఊడిపోతాయి. మీరు కావాలనుకుంటే, ఆకుకూరలను వెనిగర్ నీటిలో కూడా ఉంచవచ్చు.

నెట్ బ్యాగ్: మీరు మీ ఆకుకూరలను సులభంగా శుభ్రం చేసుకోవాలనుకుంటే, నెట్ బ్యాగ్ ఉపయోగించండి. ఆకుకూరలను కోసి బ్యాగ్లో ఉంచండి. ఒక పెద్ద పాన్ లేదా బకెట్ను నీటితో నింపి, నెట్ బ్యాగ్ను దానిలో ముంచి తీయండి. ఇది ఆకుకూరల నుండి దుమ్ము, ధూళి, కీటకాలన్నింటినీ తొలగిస్తుంది.

ఉప్పుతో కడగండి: ఆకుకూరలను కోసి ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేయండి. దీనివల్ల ఆకులకు అంటుకున్న కీటకాలు కూడా తొలగిపోతాయి.ఆకుకూరలను శుభ్రం చేసేందుకు మీరు ఎప్పుడు పెద్దగా ఉన్న గిన్నెను తీసుకోండి. మీరు కట్ చేసిన ఆకుకూరలన్నింటినీ ఒకేసారి కడగకుండా 3 భాగాలుగా విభజించి 2-3 సార్లు నీటితో శుభ్రం చేయండి. ఈ సింపుల్ టిప్స్ పాటించడం వల్ల వాటిలోని పోషకాలు పొందడంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉంటారు.