VIRAL PHOTOS : ఇక్కడ మహాత్మాగాంధీకి ఆలయం నిర్మించారు.. ప్రతిరోజు పూజిస్తున్నారు..

|

Jul 24, 2021 | 9:31 PM

VIRAL PHOTOS : దేశంలో ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ తెలుసు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషి ఎవరూ మరచిపోలేరు. భారతదేశంలోని అనేక రోడ్లు, పాఠశాలలు, కళాశాలలకు మహాత్మా గాంధీ పేరు పెట్టారు. అయితే భారతదేశంలో గాంధీజీ పేరిట ఒక ఆలయం నిర్మించారని మీకు తెలుసా?

1 / 5
కర్ణాటకలోని మంగళూరులో గాంధీజీ ప్రత్యేక ఆలయం ఉంది. అందులో ఆయనను ప్రతిరోజూ పూజిస్తారు. మంగళూరులోని శ్రీ బ్రహ్మ బైదర్కల క్షేత్ర గరోడిలో నిర్మించారు.

కర్ణాటకలోని మంగళూరులో గాంధీజీ ప్రత్యేక ఆలయం ఉంది. అందులో ఆయనను ప్రతిరోజూ పూజిస్తారు. మంగళూరులోని శ్రీ బ్రహ్మ బైదర్కల క్షేత్ర గరోడిలో నిర్మించారు.

2 / 5
మహాత్మా గాంధీ అనుచరులు ఈ ఆలయానికి వచ్చి ఆయన చెప్పినట్లు సత్యం, అహింస మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు.

మహాత్మా గాంధీ అనుచరులు ఈ ఆలయానికి వచ్చి ఆయన చెప్పినట్లు సత్యం, అహింస మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు.

3 / 5
గాంధీజీ మట్టి విగ్రహాన్ని 1948 లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ప్రజల డిమాండ్ మేరకు గాంధీజీ పాలరాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

గాంధీజీ మట్టి విగ్రహాన్ని 1948 లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ప్రజల డిమాండ్ మేరకు గాంధీజీ పాలరాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

4 / 5
గాంధీ జయంతి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండ్లు, స్వీట్లతో పాటు గాంధీజీ విగ్రహంపై బ్లాక్ కాఫీని పోసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

గాంధీ జయంతి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండ్లు, స్వీట్లతో పాటు గాంధీజీ విగ్రహంపై బ్లాక్ కాఫీని పోసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

5 / 5
ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని భతారా గ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాగితో చేసిన 6 అడుగుల ఎత్తైన గాంధీజీ విగ్రహం ఉంది.

ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని భతారా గ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాగితో చేసిన 6 అడుగుల ఎత్తైన గాంధీజీ విగ్రహం ఉంది.