
ఓ వైపు ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, ఇదే సమయంలో వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు చల్లని డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ దెబ్బకు ప్రజల దప్పికను తీర్చేందుకు కొత్త కొత్త పానీయాల షాపులు ఓపెన్ చేస్తున్నారు.

ఆదిలాబాద్లో ఈసారి కుండ లస్సీ అనే కూల్ డ్రింక్ ను పరిచయం చేశారు. అది ఓపెన్ చేసిన రోజు నుంచి జనాలు దానిని తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. వారు అంతలా తాగడానికి అసలు దీనిలో ఏం ఉన్నాయి? ఈ కుండలో ఏవేం కలుపుతున్నారో ఇక్కడ చదివి తేలుకుందాం..

ఈ కుండ లస్సీ రూ.40 నుంచి రూ. 50 రూపాయలు పలుకుతుంది. దీనిలో టేస్ట్ కోసం బాదం, జీడి పప్పును చిన్న ముక్కలుగా చేసి కలుపుతున్నారు. ఇంకా బాడీలో ఉన్న వేడిని తగ్గించే సబ్జ గింజలను దీనిలో వేయడంతో జనాలు ఎగబడి తాగుతున్నారు.

ఈ కుండలో లస్సీ తాగితే జరిగేది ఇదే: దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. కేవలం పెరుగుతోనే ఈ లస్సీ తయారు చేసి కుండల్లో పోస్తారు. మండే ఎండల్లో ఈ లస్సీ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. దీని వలన కొందరికి మాత్రం ఉపాధి దొరికిందని చెప్పవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)