
వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణం, వస్తువుల అమరికలు, తదితర మానవుల సమస్యలకు పరిష్కారాలు చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక వ్యక్తి ఒక వ్యక్తి మొదటగా చూసేది ఏదైతే ఉంటుందో దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే చూసే విషయాలు ఆ వ్యక్తి మనస్సు, శక్తి, రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. ఉదయం మొదటగా చూసే విషయాలు రోజువారీ ఆలోచనలు, ఫలితాలను ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే చూడటం అశుభంగా భావించే కొన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీడ.. ఉదయం మంచం దిగిన వెంటనే మీ నీడను ఎప్పుడూ చూడకూడదు. నిద్ర లేచిన వెంటనే మీ నీడను చూడటం అశుభమని భావిస్తారు. మీ నీడను చూసి రోజును ప్రారంభించడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది జీవితంలో ప్రతికూల శక్తిని పెంచుతుంది.

పగిలిన అద్దం.. మీరు ఉదయం బట్టలు వేసుకుని బయటకు వెళ్ళబోతున్నప్పుడు, పగిలిన అద్దంలోకి చూడటం మానుకోవాలి. అలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇప్పటికే చేసిన ఏ పనినైనా నాశనం చేస్తుంది.

మురికి పాత్రలు.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్ర లేచిన వెంటనే వంటగదిలో మురికి పాత్రలను చూడటం శుభం కాదు. కాబట్టి, ఉదయం నిద్ర లేచిన వెంటనే వంటగదిలోని మురికి పాత్రలను చూడకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లోకి దుఃఖం, పేదరికం వస్తాయి.

ఆగిపోయిన గడియారం.. వాస్తులో గడియారాలను కూడా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచుకోవడం లేదా చూడటం కూడా శుభం కాదని అంటారు. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే ఆగిపోయిన గడియారాన్ని పొరపాటున కూడా చూడకూడదు. అలా చేయడం వల్ల జీవితంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి.

విరిగిన విగ్రహం.. ఉదయం పూట విరిగిన దేవతా విగ్రహాలను చూడటం లేదా తాకడం కూడా మానుకోవాలి. ఇంట్లో విరిగిన విగ్రహాలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. విరిగిన విగ్రహాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.)