మంత్రాలయానికి మరో మణిహారం.. 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం.. వర్చువల్‌ గా శంకుస్థాపన చేసిన అమిత్‌షా

|

Jul 23, 2023 | 10:06 PM

రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

1 / 5
రాఘవేంద్ర స్వామి వెలసిన  కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా  వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

2 / 5
ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

3 / 5
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్‌ షా. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది.

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్‌ షా. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది.

4 / 5
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో  శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్‌, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్‌, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

5 / 5
 కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.

కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.