
బియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: అర కప్పు బియ్యం , ఒక లీటర్ పాలు , ఒక కప్పు బెల్లం పొడి లేదా చక్కెర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, అర కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి ఇవన్ని కలిపి తీసుకుంటే రుచి చాలా వేరు.

బియ్యం పాయసం తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని తీసుకుని వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగి 15 నుంచి 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. అయితే, ఇలా చేస్తే బియ్యం నిముషాల్లోనే మెత్తగా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పాలు పోసి బాగా మరిగించాలి. ఇవి మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బాగా ఉడికించాలి.

అయితే, మీరు వీటిని కొంచం మధ్య మధ్యలో గరిటెతో మిక్స్ అయ్యేలా బాగా కలుపుతూ ఉండాలి. అలాగే వదిలేస్తే పాలు మొత్తం అడుగంటిపోతాయి. అలాగే, బియ్యం కూడా పూర్తిగా మెత్తగా అయినా తర్వాత బెల్లం పొడి లేదా కొద్దిగా పంచదార వేయాలి. ఇంకా చక్కెర కూడా వేయాలి. ఇలా బెల్లం వేస్తే రుచి మంచిగా వస్తుంది.

ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి చిన్న పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక దానిలో జీడిపప్పు, కిస్మిస్ లు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తరవాతవాటిని పాయసంలో కూడా కలపాలి. అలాగే, చివర్లో యాలకుల కూడా వేసి ఇంకా వీటితో పాటు కొబ్బరి తురుమును కూడా వేసి బాగా మరిగించాలి.

బియ్యం పాయసం తినడం వలన లాభాలు ఇవే .. పాలలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే, దీనిని బెల్లంతో చేస్తే ఐరన్ కూడా ఉంటుంది తిన్న వెంటనే శక్తినిస్తుంది అలాగే తినడానికి ఈ స్వీట్గా తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తిన్న వెంటనే ఇది జీర్ణమవుతుంది.