పల్లెల్లో దొరికే ఈత పండ్లు తెలుసా..తింటే పుట్టెడు లాభాలు
సమ్మర్ వచ్చిందంటే చాలు పల్లె టూర్లలో చాలా మంది ఎంతో ఇష్టంగా ఈత పండ్లు తింటుంటారు. అయితే కొందరు వీటిని తినడానికి ఇష్టపడరు కానీ ఈతపండ్లు తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: May 26, 2025 | 5:37 PM

భారతదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లో ఈత పండ్లు అనేవి దొరుకుతాయి. ఈ చెట్లు చూడటానికి అచ్చం ఖర్జూర చెట్ల లా కనిపిస్తుంటాయి. కొన్ని సార్లు ఈ పండ్లు కూడా అలానే అనిపిస్తాయి. కానీ వీటి రుచి మాత్రం డిఫరెంట్గా ఉంటుందంట.అంతే కాకుండా ఈ ఈతపండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపును చల్లబరచడంలో ఈత పడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లు శరీరానికి చాలా చలువ, ఇది కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగడమే కాకుండా, ఇవి మలబద్ధకం, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి.

అంతే కాకుండా పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినడం వలన చాలా మేలు జరుగుతుంది.అంతే కాకుండ వికారం వాంతులు, నుంచి బయటపడటానికి ఈ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి బరువు నియంత్రణకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయి.

ఈత పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని ప్రయోజనాలు ప్రేగు కదలికలను కూడా వేగవంతం చేస్తాయి, దీని కారణంగా మలబద్ధకం సమస్య క్రమంగా తొలగిపోతుంది. ఈ విధంగా ఇది అన్ని కడుపు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంద.

అంతే కాకుండా ఈతపండ్లను సమ్మర్లో ప్రతి రోజూ కాకుండా కనీసం వారంలో రెండు సార్లైనా తినడం వలన ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి.



