
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్34 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ను తక్కువ ధరలో మంచి ఫీచర్స్ను అందించారు.

ఇప్పటికే లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ జూలై 15 నుంచి ఈకామర్స్ సైట్లోకి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్లో భాగంగా డిస్కౌంట్ అందిస్తున్నారు.

ధర విషయానికొస్తే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 5nm Exynos 1280 SoC ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇందులో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు

కెమరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.