
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. రియల్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ పేరుతో లాంచ్ చేయనున్న ఈ టీవీ మే 4నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ టీవీని 40, 43 ఇంచెస్ వేరియెంట్లలో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీ స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. 64 బిట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ అందించారు.

ధర విషయానికొస్తే 40 ఇంచెస్ టీవీ రూ. 22,999, 43 ఇంచెస్ టీవీ ప్రారంభ ధర రూ. 25,999గా ఉండనుంది. ఈ రెండు వేరియంట్లపై ప్రారంభ ధర కింద రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీలో 3D ఆడియో అవుట్పుట్కు సపోర్ట్ చేసే 24W డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్స్ అందించారు. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం హాట్కీస్ ఉన్న రిమోట్తో టీవీని రూపొందించారు. ఈ స్మార్ట్ టీవీపై ఏడాది వారంటీతో పాటు రెండు సంవత్సరాల స్క్రీన్ వారంటీ ఇవ్వనున్నారు.