
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఒప్పో రెనో 11 సిరీస్ పేరుతో కొత్త ఫోన్ను తీసుకురానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్ను జనవరి 11వ తేదీన భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ సిరీస్లో భాగంగా ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో అనే రెండు ఫోన్లను తీసుకొస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా కలర్ ఓఎస్ 14పై పనిచేస్తాయి. ఒప్పో రెనో 11 ఫోన్లో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లోనూ 50 మగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 32 మెగా పిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఒప్పో రెనో 11లో 6.7 ఇంచెస్తో కూడిన ఓ ఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం. ఇక రెనో 11 ప్రో విషయానికొస్తే ఇందులో.. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తోపాటు 6.74 అంగుళాల డిస్ ప్లేను అందించారు.

ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్తో పని చేస్తాయి. రెనో11 ప్రో ఫోన్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 4700 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు.