
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఐకూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఐకూ నియో 9 ప్రో పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. వచ్చే నెలలో ఈ ఫోన్ను తీసుకురానున్నారు. అమెజాన్ సైట్లో ఈ ఫోన్ సేల్కు రానుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్పై తీసుకురానున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఈ ఫోన్ను భారత్లో లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 40 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఆ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇన్బిల్ట్ స్టోరేజ్ అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించానున్నారు.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఇక ఈ ఫోన్లో 120 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో అమెజాన్ ప్రత్యే డిస్కౌంట్ ఆఫర్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.