ఒకప్పుడు కేవలం ఫోన్ మాట్లాడానికే పరిమితమైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సినిమాలు చూడడం మొదలు ఆన్లైన్ షాపింగ్ వరకు అన్నింటికి ఫోన్ అనివార్యంగా మారింది. దీంతో ఛార్జింగ్ సమస్య తలెత్తుతోంది.
దీంతో రాత్రంతా ఛార్జింగ్ పెడుతోన్న వారి సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీ పాడవడంతో పాటు, కొన్ని సందర్భాల్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే రాత్రంతా ఛార్జింగ్ పెట్టడాన్ని మానుకోవాలి.
ఛార్జింగ్కు కొందరు నాణ్యత తక్కువ ఉన్న ఛార్జర్లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫోన్ బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్ పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇక స్మార్ట్ ఫోన్స్లో లిథియం - అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. వీటికి సహజంగానే మండే స్వభావం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ను వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలోనే ఛార్జింగ్ పెట్టాలి. బాక్స్లు, డెస్క్ల్లో ఫోన్లను పెట్టి ఛార్జింగ్ చేయకూడదు.
కొందరు స్మార్ట్ ఫోన్స్ను దిండు కింద పెట్టి ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు. దీనివల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఫోన్ బ్యాటరీ 90 శాతం దాటగానే ఆపేయాలి. కొందరు 100 శాతం దాటిన తర్వాత కూడా అలాగే ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు.