అథెర్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన 450 ఎక్స్ను అప్డేట్ చేస్తూ న్యూ వెర్షన్ను ఈ ఏడాదే ప్రకటించింది. అలాగే కొన్నిస్పెసిఫికేషన్లను తగ్గించి 450 ప్లస్ను కూడా లాంచ్ చేశారు. కాబట్టి ఈ స్కూటర్లు ఇప్పుడు రెండు వేరువేరు ధరల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్ చేసిన 450 ఎస్పై కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో లూనా అనేది ఓ ట్రెండ్. ప్రారంభంలో ఈ స్కూటర్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. అయితే లూనాకు కొనసాగింపుగా ప్రస్తుతం ఈవీ వెర్షన్లో లూనా తిరిగి మార్కెట్లోకి రానుది. కైనెటిక్ గ్రీన్ లూనా సెప్టెంబర్ చివరి నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ స్కూటర్కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫొటోలు వైరలయ్యాయి.
భారత ఈవీ మార్కెట్లో రారాజుగా ఉన్న ఓలా కంపెనీ ఈ ఏడాది మరో రెండు స్కూటర్లను రిలీజ్ చేస్తన్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎస్1 ప్రో జెన్ 2తో పాటు ఎస్1 ఎక్స్ పేరుతో రెండు స్కూటర్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. త్వరలో ఈ రెండు స్కూటర్లు భారత మార్కెట్లో తమ హవా చూపనున్నాయి.
సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ కూడా వన్ పేరుతో ఓ సరికొత్త ఈవీ స్కూటర్ను రిలీజ్ చేసింది. లుక్తో పాటు డిజైన్పరంగా ఈ స్కూటర్ ఈవీ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా స్పోర్టీ స్టైలింగ్తో వచ్చే ఈ స్కూటర్ ఈ ఏడాది చివరి నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్ దాని టాప్ ఎండ్ ఎస్టీను కూడా ప్రకటించారు. అయితే ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఎస్టీ మోడల్ క్రేజీ అప్డేట్ను కంపెనీ ఇచ్చింది. ఈ స్కూటర్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ దీన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.