
శరీరంలో మలినాలను బయటికి పంపడంలో కిడ్నీలు సహాయపడతాయి. శరీరంలో పొటాషియం స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. అయితే నేటి జీవనశైలి, క్రమం తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సమస్యలకు గురవుతున్నాయి.

తొలినాళ్లలోనే జాగ్రత్త వహిస్తే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మూత్రపిండ వ్యాధుల లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసికుందాం.

మూత్రపిండ వ్యాధులను మూత్రం ద్వారా త్వరగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం రావడం, మూత్రం రంగులో మార్పు కనిపించడం వంటివి ఇవి కిడ్నీల వ్యాధి ప్రారంభ లక్షణాలుగా గుర్తించాలి. ఇటువంటి సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ ఇన్ఫెక్షన్కు సకాలంలో చికిత్స తీసికోకుంటే అనేక సమస్యలకు కారణం అవుతుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైన సందర్భాల్లో కిడ్నీ మార్పిడి చేయవలసి వస్తుంది. చాలామందికి కిడ్నీల్లో రాళ్లు కారణంగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మూత్రానికి సంబంధించిన ఎలాంటి లక్షణం కనిపించిన వెంటనే వైదున్ని సంప్రదించాలి. మూత్రంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి చేరి, కిడ్నీ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది.

పాదాలలో వాపు కిడ్నీల వ్యాధికి మరో సూచన. పాదాల్లో తరచూ వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి డయాబెటిస్, గుండె సమస్యలున్న వారు కిడ్నీ వ్యాధులపై శ్రద్ధ వహించాలి. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం వీరిలో ఎక్కువగా ఉంటుంది.

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మందులు ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. మూత్రానికి సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.