Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే

|

Sep 03, 2024 | 2:54 PM

హిందూ మతంలో గణేశుడికి మొదటి పూజ చేస్తారు. పండగైనా, శుభకార్యమైనా, ఏదైనా ఫంక్షన్ అయినా సరే మొదట బొజ్జ గణపయ్యను ప్రార్ధించి ఆ కార్యాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే వినాయకుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిని నిర్విఘనంగా జరిగేలా చేస్తాడని నమ్ముతారు. అందుకే ఇంట్లో ఏదైనా పని చేసే ముందు వినాయకుడిని ప్రార్థించడం, పూజించడం హిందూ సంప్రదాయం. అయితే కొంతమంది తమ ఇంటి ప్రధాన ద్వారానికి రకరకాల డిజైన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. కొందరు తలపులకు వినాయకుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఇలా చ చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం

1 / 5
చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారానికి  రకరకాల దేవుళ్ళు, డిజైన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొంతమంది తమ ఇంటి ముందు ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచుతారు.

చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారానికి రకరకాల దేవుళ్ళు, డిజైన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొంతమంది తమ ఇంటి ముందు ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచుతారు.

2 / 5
ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను ఉంచడం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం.

ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను ఉంచడం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం.

3 / 5
మెయిన్ డోర్ పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివిటీ రాదు. ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

మెయిన్ డోర్ పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివిటీ రాదు. ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

4 / 5
అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి కలిగిస్తుంది.

అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి కలిగిస్తుంది.

5 / 5
ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పని జరుగుతుంది.

ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పని జరుగుతుంది.