
తిరుమల తిరుపతి మలయప్ప స్వామివారి భక్తులకు అలర్ట్.. స్వామివారి దర్శనం కోసం ఆగస్టు 24న రూ.300 దర్శన టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల చేయనుంది.

స్వామివారి భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు. అయితే ఈ టికెట్ల సంఖ్యను పెంచకుండా యథాతధంగా దర్శనాలు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.