Significance of Kumkum: హిందూ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకున్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా

|

Aug 01, 2021 | 6:10 PM

భారతీయ హిందువుల సంప్రాయంలో కుంకుమను అత్యంత ప్రాధాన్యత ఉంది.కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైనది. స్త్రీ ఐదో తనానికి గుర్తుగా భావింపబడుతుంది. కుంకుమని నుదిటి మీద పట్టుకుంటారు. ఐతే ఇలా కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. హిందూ సంస్కృతీ సాంప్రదాయాలతో పెనవేసుకున్న కుంకుమ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం..

1 / 8
కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి

కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి

2 / 8
 షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమనీ, లక్ష్మీదేవి వస్తుందనీ విశ్వసిస్తారు. పెళ్లయిన స్త్రీలు పసుపుని తాళిబొట్టుకు అద్దుకునీ, కుంకుమని ముఖాన దిద్దుకుంటారు.

షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమనీ, లక్ష్మీదేవి వస్తుందనీ విశ్వసిస్తారు. పెళ్లయిన స్త్రీలు పసుపుని తాళిబొట్టుకు అద్దుకునీ, కుంకుమని ముఖాన దిద్దుకుంటారు.

3 / 8
స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్లినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడామగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుడుల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి.

స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్లినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడామగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుడుల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి.

4 / 8
పూర్వకాలం నుంచీ కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచునూరు పద్మావతీ దేవి, కాంచీపురంలోని శ్రీ కామాక్షి, కోల్ కత్తా లోని శ్రీ మహాకాళి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వుతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ దేవతకు అలంకరించిన మొగలిపూలనూ, కుంకుమనీ ప్రసాదంగా అందిస్తారు.

పూర్వకాలం నుంచీ కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచునూరు పద్మావతీ దేవి, కాంచీపురంలోని శ్రీ కామాక్షి, కోల్ కత్తా లోని శ్రీ మహాకాళి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వుతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ దేవతకు అలంకరించిన మొగలిపూలనూ, కుంకుమనీ ప్రసాదంగా అందిస్తారు.

5 / 8
పెళ్ళైన స్త్రీలు పాపిట సింధూరాన్ని ధరిస్తారు. ఎందుకంటే దానిని బ్రహ్మ రంధ్రము గానూ, ఆధ్యాత్మిక కేంద్రముగానూ చెబుతుంటారు.

పెళ్ళైన స్త్రీలు పాపిట సింధూరాన్ని ధరిస్తారు. ఎందుకంటే దానిని బ్రహ్మ రంధ్రము గానూ, ఆధ్యాత్మిక కేంద్రముగానూ చెబుతుంటారు.

6 / 8
 హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే... ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో... రాముడి ఆయుష్షు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామ భక్తుడైన హనుమ జానకీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామ భక్తే.... హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం.

హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే... ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో... రాముడి ఆయుష్షు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామ భక్తుడైన హనుమ జానకీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామ భక్తే.... హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం.

7 / 8
శివ భక్తులు విభూతితో మూడు అడ్డ నామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు.

శివ భక్తులు విభూతితో మూడు అడ్డ నామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు.

8 / 8
విష్ణుభక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం. మధ్యలో ఎర్రనామం లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు.

విష్ణుభక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం. మధ్యలో ఎర్రనామం లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు.