
శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. అంతే కాకుండా ఈ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది అని కూడా అంటారు. అందువలన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు ఉంటూ పూజ చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ వ్రతాలు, పూజలు చేస్తుంటారు. అయితే అబ్బాయిలు కూడా శివుడిని ఆరాధిస్తూ పూజలు చేయవచ్చునా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

అయితే శివ పురాణం ప్రకారం, శివుడిని పూజించడానికి స్త్రీ ,పురుషులకు సమాన హక్కు ఉంటుంది. అందువలన ఎవరు అయితే వివాహం ఆలస్యం వలన ఇబ్బంది పడుతున్నారో, వారు ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం చాలా మంచిదంట. అవివాహితులై పురుషులు, అర్థం చేసుకునే, యోగ్యురాలైన భార్య తన జీవితంలోకి రావాలని శ్రావణ సోమవారం ఉపవాస దీక్ష పాటించవచ్చునంట.

శ్రావణ సోమవారం ఉపవాస దీక్ష వ్రతం చేపట్టాలంట. ప్రతి రోజూ శివుడిని ఆరాధిస్తూ, సోమవారం ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి , శుభ్రమైన బట్టలు ధరించి, ఉపవాస దీక్ష చేపట్టాలంట. అంతే కాకుండా శివాలయాన్ని సందర్శించి, శివలింగానికి స్వచ్ఛమైన నీరు లేదా గంగా జలంతో అభిషేకం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయంట.

ఉపవాసం ఉంటూ, తేలికపాటి ఆహారం తీసుకుంటూ శివుడిని మనసులో ఆరాధించాలంట. ఇలా శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు ప్రతి సోమవారం, ఉపవాస దీక్ష, శ్రావణ సోమవారం వ్రతం లాంటిది చేపట్టడం వలన మంచి భార్య రావడమే కాకుండా, త్వరగా వివాహం అవుతుంది అని చెబుతున్నారు పండితులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు