
పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి అనేక అంతు చిక్కని రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైన నమ్మకం ఒకటి పక్షులు లేదా విమానాలు దానిపై ఎగరవు. సరే విమానాలంటే మనుషుల కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనం అటుగా విమానం తీసుకెళ్తే వెళ్తాయి.. లేదంటే లేదు. కానీ, పక్షులు మన కంట్రోల్లో ఉండవు. అవి మనుషులు చెప్పినట్లు ఎగరవు. వారి ఇష్టమొచ్చినట్లు ఎగురుతూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లాయి. కానీ, పూరీ జగన్నాథ ఆలయం మీదుగా మాత్రం పక్షులు ఎగరవు అని అంటారు. దానికి మతపరమైన, శాస్త్రీయ నమ్మకాలు రెండూ ఉన్నాయి. ఇది భక్తులు, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే రహస్యం.

అత్యంత ప్రముఖమైన మత విశ్వాసం ఏమిటంటే.. జగన్నాథుని (విష్ణువు అవతారం) వాహనమైన గరుడదేవుడు, పక్షుల రాజు కూడా, స్వయంగా ఈ ఆలయాన్ని రక్షిస్తాడు. పక్షుల రాజు స్వయంగా ఆలయాన్ని రక్షిస్తున్నప్పుడు, ఇతర పక్షులు గౌరవం లేదా భయం కారణంగా ఆలయంపైకి ఎగరవని నమ్ముతారు.

Puri Jagannath Temple

ముఖ్యంగా 214 అడుగుల ఎత్తైన ఆలయ నిర్మాణం చుట్టూ. ఆలయం ఎత్తు, దాని స్థూపాకార లేదా భారీ నిర్మాణం కారణంగా దాని పైన గాలి ప్రవాహం చాలా వేగంగా, సంక్లిష్టంగా ఉంటుంది ('కర్మాన్ వోర్టెక్స్ స్ట్రీట్') పక్షులు సమతుల్యతను కాపాడుకోవడం, అంత ఎత్తులో ఎగరడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

విమానాల విషయానికొస్తే.. పూరి నగరం ఏ సాధారణ విమాన మార్గంలోకి రాదని చెబుతారు. కాబట్టి విమానాలు అక్కడి నుండి ఎగరడానికి ఎటువంటి కారణం లేదు. అలాగే ఆలయం పైభాగంలో ఏర్పాటు చేయబడిన ఎనిమిది లోహాలతో తయారు చేయబడిన నీలచక్రం వైర్లెస్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగిస్తుందని, విమానాలకు ముప్పు కలిగిస్తుందని కొందరు నమ్ముతారు.