Kamakshi Devi: కనుల పండువగా కామాక్షిదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. హంసం, చిలుక,వెండి రథాలపై ఊరేగిన ఉత్సవమూర్తి

Updated on: Feb 19, 2022 | 6:47 PM

Kamakshi Devi: మహా శక్తి పీఠాలలో ఒకటైన కాంచీపురం(Kanchipuram)లో కొలువుదీరిన శ్రీ కామాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 8న ధ్వజారోహణతో ప్రారంభమైన అమ్మవారి బ్రహ్మోత్సావాలు ఈ రోజు ఉత్సవ స్పందనతో ముగుస్తాయి. కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ..

1 / 8
కంచిలో ఉన్న ప్రముఖ దేవాలయం కామాక్షి అమ్మవారి దేవాలయం. కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి.

కంచిలో ఉన్న ప్రముఖ దేవాలయం కామాక్షి అమ్మవారి దేవాలయం. కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి.

2 / 8
 బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకామాక్షి ఉత్సవమూర్తిని హంసం, చిలుక, సూర్యప్రభాయి వంటి బంగారు కొండలపై ఊరేగించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకామాక్షి ఉత్సవమూర్తిని హంసం, చిలుక, సూర్యప్రభాయి వంటి బంగారు కొండలపై ఊరేగించారు.

3 / 8
ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల లాంతర్లు, రంగురంగుల గొలుసులు, కర్రలతో అలంకరించారు.

ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల లాంతర్లు, రంగురంగుల గొలుసులు, కర్రలతో అలంకరించారు.

4 / 8
కామాక్షి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగిమ లో యోగ ముద్రలో ఉంటారు. తన ఎడమ చేతిలో చెరకు గడ, తన కుడి చేతిలో చిలుకను పట్టుకుని శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు.

కామాక్షి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగిమ లో యోగ ముద్రలో ఉంటారు. తన ఎడమ చేతిలో చెరకు గడ, తన కుడి చేతిలో చిలుకను పట్టుకుని శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు.

5 / 8
ఈ ఆలయం అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి ఆలయాన్ని పల్లవ రాజులు కట్టించివుండవచ్చనని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈ ఆలయం అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి ఆలయాన్ని పల్లవ రాజులు కట్టించివుండవచ్చనని చరిత్రకారులు భావిస్తున్నారు.

6 / 8
సతీదేవి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనం తో యోగ ముద్రలో ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత.

సతీదేవి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనం తో యోగ ముద్రలో ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత.

7 / 8

ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం, అరూపలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.

ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం, అరూపలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.

8 / 8
 అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది.

అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us