IRCTC Tour: టూర్ ప్లాన్ చేస్తున్నారా..? రూ.5 వేల ఖర్చుతో ఈ ఐదు పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు..!

|

Mar 27, 2023 | 7:55 AM

IRCTC Tour: దేశంలోని పర్యాటకుల కోసం IRCTC ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది. వాటిని మనం తక్కువ ఖర్చులోనే సందర్శించవచ్చు. మరి అలా ఐఆర్‌సీటీసీ ప్రకటించిన టాప్ 5 టూర్ ప్యాకేజీల వివరాలు మనం ఇప్పుడు చూద్దాం..

1 / 5
 షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్:  మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్: మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

2 / 5
వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

4 / 5
మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

5 / 5
వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.

వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.