Ganesha Temples: భారతదేశంలోని ప్రసిద్ధ గణేశ దేవాలయాలు.. చవితి రోజున సందర్శించడానికి ప్లాన్ చేసుకోండి..

|

Aug 27, 2024 | 6:31 PM

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ హిందూ మతంలో వినాయకుడికి ప్రధమ స్థానం ఉంది. అంతేకాదు ఏదైనా పని ప్రారంభించే ముందు, శుభకార్యాల్లో, పూజ సమయంలో మొదటగా వినాయకుడిని ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. గణేశుడి ఆశీస్సులతో ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని సజావుగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని చెబుతారు.

1 / 5
గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ రోజును గణేష్ చతుర్థి అంటారు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 7 న వినాయక చవితి వచ్చింది. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. గణేష్ చతుర్థి రోజున ప్రజలు ఉత్సవంగా వినాయక విగ్రహాన్ని తమ ఇళ్లకు తీసుకువస్తారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా వినాయక చవితిని జరుపుకుంటారు. వినయక చవితి సందర్భంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే దేశంలోని అతిపెద్ద, పురాతన గణపతి ఆలయాలను సందర్శించవచ్చు.

గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ రోజును గణేష్ చతుర్థి అంటారు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 7 న వినాయక చవితి వచ్చింది. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. గణేష్ చతుర్థి రోజున ప్రజలు ఉత్సవంగా వినాయక విగ్రహాన్ని తమ ఇళ్లకు తీసుకువస్తారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా వినాయక చవితిని జరుపుకుంటారు. వినయక చవితి సందర్భంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే దేశంలోని అతిపెద్ద, పురాతన గణపతి ఆలయాలను సందర్శించవచ్చు.

2 / 5
 
సిద్ధివినాయక దేవాలయం, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సిద్ధివినాయక దేవాలయాన్ని సందర్శించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఈ ఆలయం 1801లో స్థాపించబడింది. సిద్ధివినాయకుని ఆలయంలో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. బప్పా దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.

సిద్ధివినాయక దేవాలయం, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సిద్ధివినాయక దేవాలయాన్ని సందర్శించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఈ ఆలయం 1801లో స్థాపించబడింది. సిద్ధివినాయకుని ఆలయంలో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. బప్పా దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.

3 / 5
చింతామణి గణపతి ఆలయం, ఉజ్జయిని: ఉజ్జయిని మహాకాల్ నగరం అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా మహాకాలేశ్వరుడి కుమారుడైన శ్రీ గణేశుని పురాతన ఆలయం ఉంది. ఆలయ గర్భగుడిలో మూడు వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. వీటిలో మొదటిది చింతామణి వినాయకుడు, రెండవది ఇచ్చమని గణపతి, మూడవది సిద్ధివినాయక గణేష్ విగ్రహం. మహాకాలేశ్వరుడి సందర్శించి  చింతామణి గణపతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు

చింతామణి గణపతి ఆలయం, ఉజ్జయిని: ఉజ్జయిని మహాకాల్ నగరం అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా మహాకాలేశ్వరుడి కుమారుడైన శ్రీ గణేశుని పురాతన ఆలయం ఉంది. ఆలయ గర్భగుడిలో మూడు వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. వీటిలో మొదటిది చింతామణి వినాయకుడు, రెండవది ఇచ్చమని గణపతి, మూడవది సిద్ధివినాయక గణేష్ విగ్రహం. మహాకాలేశ్వరుడి సందర్శించి చింతామణి గణపతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు

4 / 5
గణపతిపూలే ఆలయం, రత్నగిరి: మహారాష్ట్రలోని కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఈ వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న వినాయకుడు స్వయంభువుగా ఏర్పడిందని నమ్మకం. ఈ విగ్రహం సుమారు 400 సంవత్సరాల నాటిది. అటువంటి పరిస్థితిలో గణపతి దర్శనం కోసం సంవత్సరం పొడవునా ఈ ఆలయానికి వస్తారు. ఈ గణేషోత్సవంలో గణపతిని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోండి.

గణపతిపూలే ఆలయం, రత్నగిరి: మహారాష్ట్రలోని కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఈ వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న వినాయకుడు స్వయంభువుగా ఏర్పడిందని నమ్మకం. ఈ విగ్రహం సుమారు 400 సంవత్సరాల నాటిది. అటువంటి పరిస్థితిలో గణపతి దర్శనం కోసం సంవత్సరం పొడవునా ఈ ఆలయానికి వస్తారు. ఈ గణేషోత్సవంలో గణపతిని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోండి.

5 / 5
త్రినేత్ర ఆలయం, రణతంబోర్: రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోని పురాతన గణపతి ఆలయంగా ప్రసిద్ది గాంచింది. దీనితో పాటు ప్రపంచంలోని ఏకైక గణేష్ దేవాలయం ఇక్కడ మూడు కన్నుల శ్రీ గణేశుడి విగ్రహం ఉంది. దీనితో పాటు గణపతి బప్పా తన కుటుంబంతో సహా ఈ ఆలయంలో కొలువు దీరి పూజలను అందుకుంటున్నారు.

త్రినేత్ర ఆలయం, రణతంబోర్: రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోని పురాతన గణపతి ఆలయంగా ప్రసిద్ది గాంచింది. దీనితో పాటు ప్రపంచంలోని ఏకైక గణేష్ దేవాలయం ఇక్కడ మూడు కన్నుల శ్రీ గణేశుడి విగ్రహం ఉంది. దీనితో పాటు గణపతి బప్పా తన కుటుంబంతో సహా ఈ ఆలయంలో కొలువు దీరి పూజలను అందుకుంటున్నారు.