
స్వప్నశాస్త్రం ప్రకారం, ఎవరికి అయితే బ్రహముహుర్తంలో కలలో ధాన్యం కనిపిస్తుందో, వారి పంట పండినట్లేనంట. వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి కలలు సంపదను సూచిస్తాయంట. ఎవరికి అయితే కలలో ధాన్యం కనిపిస్తుందో వారి ఆర్థిక సమస్యలు తీరిపోయి, ఇంటిలో సంపద పెరుగుతుంది అనే సంకేతం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

కలలో బంగారం లేదా వెండి కనిపించడం చాలా శుభప్రదం. ఎవరికి అయితే తెల్లవారుజామునే వెండి లేదా బంగారం కలలో కనిపిస్తుందో, వారికి ఆదాయం రెట్టింపు అవుతుందంట. అంతే కాకుండా ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుందని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.

తామర పువ్వు : తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పుష్పం అంటారు. అందువలన కలలో ఇది కనిపించడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికి అయితే బ్రహ్మముహుర్తంలో కలలో తామర పువ్వు కనిపిస్తుందో వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట. ఆదాయం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ఇంటిలో సంపద అమాంతం పెరుగుతుందంట.

వెలుగుతున్న దీపం : దీపం చాలా శుభప్రదమైనది. అందువలన ఎవరి కలలోనైతే వెలుగుతున్న దీపం కనిపిస్తుందో వారికి ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుందంట. ఆదాయం పెరుగుతుంది. వారు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారంట. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు