
✸ వైద్యనాధ్ జ్యోతిర్లింగం.. శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది.

✸ భీమశంకర జ్యోతిర్లింగం.. శ్రీభీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్లో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.

✸ శ్రీఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం.. శ్రీ ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.

✸ కేదార్నాద్ జ్యోతిర్లింగం.. శ్రీ కేధారేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలో ఉంది.

✸ శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం.. శ్రీశైలం మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వేస్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.

✸ నాగనాధేశ్వర జ్యోతిర్లింగం.. శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.

✸ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి.

✸ రామేశ్వర జ్యోతిర్లింగం.. తమిళనాడు లోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి.

✸ సోమనాధ జ్యోతిర్లింగాలయం... గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉంది.

✸ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం.. శ్రీత్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

✸ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగరతీర్థములు, 28 తీర్థంలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతి ర్లింగం.

✸ విశ్వేశర జ్యోతిర్లింగం.. శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు.