
తినే తిండి విషయంలో తక్కువ కేలరీలు తీసుకుంటే అంత మంచిది. దీనితో పాటు నీరు పుష్కలంగా త్రాగాలి. ఎక్కువ పండ్లు తినాలి. డ్రై ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్ ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి డ్రై ఫ్రూట్స్ తినండి. వీటిల్లో ఖర్జూరం చాలా ఆరోగ్యకరమైనది. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను ఒక కప్పు నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగి నానబెట్టిన ఖర్జూరాన్ని తినండి. 30 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి

ప్రస్తుతం చాలా మంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జీర్ణ ప్రక్రియలో సహా అనేక ఇబ్బందులు పడతారు. ఈ సమస్యలను ఖర్జూరాలు దూరం చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాన్ని ప్రతిరోజూ తినండి. మల విసర్జనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మలం చాలా మృదువుగా ఉంటుంది

చాలా చిన్న వయస్సు నుండి ఎముక క్షీణతతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి, మోకాళ్ల సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినండి. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం శరీరానికి ఉపయోగపడుతుంది

షుగర్ వ్యాధిగ్రస్తులు ఖర్జూరం తియ్యగా ఉండడంతో తినడానికి భయపడతారు. కానీ ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నందున ఈ పండును నిర్భయంగా తినవచ్చు. రోజుకి ఒక ఖర్జూరం తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉండదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినాలనుకుంటే రోజూ ఒక ఖర్జూరం తినండి

మెదడు పనితీరును పెంచడంలో కూడా ఖర్జూరం ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో ఫ్లేవినాయిడ్స్ ఉంటాయి, ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడానికి ఖర్జురం మంచి మెడిసిన్. జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజూ 1-2 ఖర్జూరాలు తినాలి