
ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలను చేస్తారు. చాలా మంది ముల్తానీ మట్టిని అప్లై చేస్తుంటారు. దీని వల్ల ముఖంలో డల్నెస్ తొలగిపోవడమే కాకుండా, మొటిమలు తగ్గుముఖం పడుతాయి. అలాగే ముఖంలో మెరుపు కూడా వస్తుంది. అయితే, దానిని సరిగా వినియోగించకపోతే.. చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

సున్నితమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి వాడకాన్ని తగ్గించాలి. ముల్తానీ మట్టిని ఎక్కువగా వాడితే ముఖంపై డల్నెస్, దద్దుర్లు వస్తాయి.

పొడి చర్మం కలిగిన వ్యక్తులు ముల్తానీ మట్టిని వాడకూడదు. దీని వల్ల వారి చర్మం మరింత పొడిగా మారుతుంది. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.

జలుబు, దగ్గుతో బాధపడేవారు సైతం ముల్తానీ మట్టిని వాడకూడదు. ముల్తానీ మట్టి చల్లటి స్వభావం వల్ల జలుబు, దగ్గు సమస్య మరింత పెరుగుతుంది.

ముల్తానీ మట్టిని క్రమం తప్పకుండా ఉపయోగించే వ్యక్తుల ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంది.