
Curd Drinks Facts

చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రిపూట పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారు రాత్రి భోజనంలో పెరుగు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు. వీలైతే, మజ్జిగ తాగొచ్చని అంటున్నారు.

రాత్రుళ్లు పెరుగు తినటం వల్ల ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా రోజూ పెరుగు తినడం మంచిది కాదు.

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అలాగే తరచుగా అసిడిటీ, అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్తో బాధపడుతుంటే, మీ జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నప్పుడు పెరుగు తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు అసలు తినొద్దని సూచిస్తున్నారు.

జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు, అలర్జీ ఉన్న వాళ్లు మాత్రం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. పెరుగుతో ఒంట్లో కఫం పెరుగుతుంది. అందువల్ల రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.