RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. బ్యాంకులకు రూ.3.14 కోట్లు

|

Aug 01, 2023 | 6:45 PM

ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపిన నేపథ్యంలో భారీ ఎత్తున నోట్లు డిపాజిట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాలు తెలిపింది. మేలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ..

1 / 5
ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపిన నేపథ్యంలో భారీ  ఎత్తున నోట్లు డిపాజిట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాలు తెలిపింది.  మేలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత రూ.3.14 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 88 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం తెలిపింది.

ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపిన నేపథ్యంలో భారీ ఎత్తున నోట్లు డిపాజిట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాలు తెలిపింది. మేలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత రూ.3.14 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 88 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం తెలిపింది.

2 / 5
బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జూలై 31, 2023 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని ఆర్‌బిఐ తెలిపింది. అయితే జూలై 31న బ్యాంకుల పని వేళలు ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ. 0.42 లక్షల కోట్లు ప్రజల వద్ద ఉన్నాయి అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 88 శాతం తిరిగి వచ్చాయి.

బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జూలై 31, 2023 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని ఆర్‌బిఐ తెలిపింది. అయితే జూలై 31న బ్యాంకుల పని వేళలు ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ. 0.42 లక్షల కోట్లు ప్రజల వద్ద ఉన్నాయి అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 88 శాతం తిరిగి వచ్చాయి.

3 / 5
అయితే మార్చి 31, 2023న ఈ రెండు వేల రూపాయల నోట్ల విలువ 3.62 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, మే 19వ తేదీన బ్యాంకు పని వేళలు ముగిసే సమయానికి రూ.3.56 లక్షల కోట్లకు తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది.

అయితే మార్చి 31, 2023న ఈ రెండు వేల రూపాయల నోట్ల విలువ 3.62 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, మే 19వ తేదీన బ్యాంకు పని వేళలు ముగిసే సమయానికి రూ.3.56 లక్షల కోట్లకు తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది.

4 / 5
2000 రూపాయల డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని తెలిపింది. ఇక మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.

2000 రూపాయల డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని తెలిపింది. ఇక మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.

5 / 5
అయితే సెప్టెంబరు 30, 2023 వరకు అవకాశం ఉన్నందున రెండు వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవాలని ఆర్బీఐ తెలిపింది. అయితే ఈ నోట్లు ఉన్నవాళ్లు చివరి వరకు ఎదురు చూడకుండా ముందస్తుగానే నోట్లను డిపాజిట్‌ చేసుకోవడం, లేదా మార్పిడి చేసుకోవడం మంచిదని రిజర్వ్‌ బ్యాంకు సూచిస్తోంది.

అయితే సెప్టెంబరు 30, 2023 వరకు అవకాశం ఉన్నందున రెండు వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవాలని ఆర్బీఐ తెలిపింది. అయితే ఈ నోట్లు ఉన్నవాళ్లు చివరి వరకు ఎదురు చూడకుండా ముందస్తుగానే నోట్లను డిపాజిట్‌ చేసుకోవడం, లేదా మార్పిడి చేసుకోవడం మంచిదని రిజర్వ్‌ బ్యాంకు సూచిస్తోంది.