
వర్షాకాలంలో బైక్స్ ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి లేదంటే విషపురుగులు, పాములు చొరబడే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పొరపాటున ఇవి వాటిలో దూరిన కూడా త్వరగా తెలియదు. ఇప్పుడు మహానందిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక కరివేన సత్రం దగ్గర పార్కింగ్ చేసిన ఓ స్కూటీలోకి దూరిపోయింది. అసలు ఇది వింతగానే ఉంది. అంతపైకి ఎలా వెళ్ళింది, ఆ స్కూటీలో ఎలా నక్కింది. ఒక్కసారిగా చూసిన జనాలు కూడా షాక్ అయ్యారు.

ఇది గమనించిన స్థానికులు స్కూటీ యజమానికి సమాచారం ఇచ్చారు. ఇక అసలు ఆలస్యం చేయకుండా స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని పాము పట్టుకునేందుకు చాలా కష్ట పడ్డారు. ఆ స్నేక్ క్యాచర్ పేరు మోహన్. ఆయన కొద్దీ నిముషాల పాటు తిప్పలు పడి బయటకు తీశారు.

స్కూటీలో దూరిన కొండచిలువను చాకచక్యంగా మోహన్ బయటికి తీసి ప్రాణాలతో అడవిలోకి వదిలిపెట్టారు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి, మీరు కూడా ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు మంచి ప్రదేశమా కాదా అనేది కచ్చితంగా చూసుకోండి. లేదంటే ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.

నల్లమల అభయారణ్యం ఆనుకొని మహానంది ఆలయం ఉండటంతో తరచుగా పాములు ఇతర విషపురుగులు, వన్య మృగాలు తరచుగా వస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆలయ అధికారులు.