
వారంలో నాలుగు సార్లు తినడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మందులు వాడే కన్నా వీటిని తినడం చాలా మంచిది. మన శరీరానికి ఏవి తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

మెంతి ఆకులు: డయాబెటిస్ ను చిన్న సమస్య లాగా చూడకండి. మెంతి ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. మెంతిని రోజూ తినడం వలన తింటే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

పాలకూర : పాలకూరలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. పాలకూరను తినడం వలన ఎముకలు బలంగా అయ్యేలా చేస్తాయి. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. దీనిని తినే ముందు వైద్యులను సంప్రదించి తినడం మంచిది.

పుదీనా : పుదీనా ఆకులు పొట్ట సమస్యలకు చెక్ పెడతాయి. కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పుదీనా తో టీ కూడా చేసుకుని తాగొచ్చు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

తోటకూర: తోటకూరలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే, ఇవి కళ్ళకి చాలా మంచివి. కళ్ళు సరిగా కనపడని వారు దీనిని తింటే చాలా మంచిది. అంతే కాదు, రక్తహీనతతో బాధపడేవారికి ఇవి చాలా మంచిగా ఉంటాయి.