
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయనున్న ఈ రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని తలపించనుంది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ప్రయాణికులకు అందు బాటులోకి రానున్నాయి. ఈనెల 8న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా, మరికొన్నింటిని ప్రారంభించనున్నారు.

ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. రూ.719 కోట్ల అంచనా వ్య యంగా నిర్ణయించారు. ఈ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపు దిద్దుకో నుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్కే తలమానికంగా నిలవనున్న ఈ రైల్వే స్టేషన్లో ప్రయా ణికుల విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్లు, రైళ్ల రాక పోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను ఏర్పా టు చేయనున్నారు.

రోజురోజుకీ పెరుగుతోన్న రద్దీ నేపథ్యంలో ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలతో స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. G + 3 అంతస్తులతో ఉత్తరం వైపు ఒక స్టేషన్ భవనం, దక్షిణం వైపు మరో భవనం నిర్మించనున్నారు.

రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ఫామ్స్ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు.

ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రైతిఫిల్ బస్స్టేషన్కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చివెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాట్లు చేయనున్నారు.

ఇక, ఈ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ గతంలోనే రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రధాని మోడీ షెడ్యూల్ను ఖరారు చేసింది. కాగా, తన పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

సికింద్రా బాద్- తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఈ ఎక్స్ప్రెస్ రైలు ఈ మా ర్గం లో ప్రయాణించే మిగతా రైళ్ల కన్నా దాదాపు 8 గంటలలోపే గమ్యస్థానానికి ప్రయాణికులను చేర వేయనుంది. తాజాగా ఈ రైలుకు రైల్వే శాఖ నంబర్లను కూడా కేటాయించింది.