
అంతే కాకుండా ఈ సీజన్లో పాములు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే పొలం దగ్గర పాములు ఉండే వారు కొన్ని మొక్కలను వరి పొలం చుట్టూ నాటుకోవడం చాలా మంచిదంట. దీని వలన పాములు పొలం గట్ల చుట్టూ ఎక్కువగా ఉండవు. అంతే కాకుండా ఈ సమయంలో పొలానికి చీడా పీడ చాలా ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వరి పొలంపై తెల్ల దోమ, పురుగులు వంటి అనేక రకాలు పొలంపై దాడి చేసి, పంట చేనును పాడు చేస్తుంటాయి. అయితే ఇటువంటి సమయంలో , పొలంలోని చీడ పీడ, పాములు కూడా ఎక్కువగా కనిపించకూడదు అంటే తప్పకుండా దాని చుట్టూ కొన్ని రకాల మొక్కలు నాటాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

బంతి మొక్క గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది పంట పొలం చుట్టూ పొలం గట్లపై ఉండటం చాలా మంచిది. బంతి వాసన పాములకు అస్సలు నచ్చదు. అందువలన ఈ మొక్కలను వరి పొలం చుట్టూ ఉండే గట్లపై పెట్టడం వలన ఇది పాముల దరి చేరకుండా చేస్తుంది అలాగే, తెల్ల దోమ, నులి పురుగును తన వైపు లాక్కొని, పంటను కాపాడుతుంది. అందుకే రైతులు వరిపొలం చుట్టూ ఈ మొక్కను నాటుకోవడం చాలా మంచిది.

ముఖ్యంగా పొలం గట్లపై బంతి పువ్వు మొక్కలు నాటుకోవడం చాలా మంచిది. నారింజ , పసుపు రంగు బంతి పువ్వు మొక్కలను గట్లపై ప్రతి పది అడుగుల దూరంలో ఒకటి నాటడం వలన ఇవి పాములు రాకుండా చేయడమే కాకుండా, నులి పురుగు, ఆకుమడత, తెల్ల దోమ, వంటి అనేక సమస్యల నుంచి పంటను కాపాడుతుంది.

అంతే కాకుండా పొలం గట్లపై స్నేక్ ప్లాంట్ మొక్కను, రెండు అడుగుల దూరంలో నాటడం వలన పాములు పారిపోతాయంట. ఇవే కాకుండా లెమన్ గ్రాస్ కూడా పాములను, చీడ పీడను తరిమికొట్టడంలో అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.