
శివరాత్రి వంటి పవిత్ర రోజు తర్వాత గ్రహణం ఏర్పడటం , ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 ఆది వారం రోజున ఈ పండుగ వస్తుంది. సాయంత్రం 5. 05 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి16 సాయంత్రం 5.34 గంటలకు ముగుస్తుంది. ఈ పండుగను ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. ఇక ఫిబ్రవరి 17న సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే శివ రాత్రి తర్వాత సూర్య గ్రహణం రావడం వలన నాలుగు రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

సింహ రాశి : సింహ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని విధంగా సమస్యలు పెరుగుతాయి. గ్రహణం సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో సమస్యలు అధికం అవుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వార చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మోసపోయే ఛాన్స్ ఉంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్త తప్పనిసరి, మాట్లాడే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్థులకు ఒత్తిడి అధికం అవుతుంది. కష్టానికి తగిన ఫలితం లభించదు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి శివ రాత్రి తర్వాత, రాహు, కేతువు ప్రభావంతో ఏర్పడే సూర్య గ్రహణం వలన అనేక సమస్యలు ఎదురు కానున్నాయంట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి ప్రయాణంలో సమస్యలు ఎదురు అవుతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి.