
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్రేగులపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ నీటిని రోజుకు ఒకసారి తాగడం మంచిది. అయితే, అంతకంటే ఎక్కువగా తాగకూడదు.

ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.

వేడి చేయవద్దు: వేడి నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మరసాన్ని వేడి చేసినప్పుడు, దానిలోని కీలక పోషకమైన విటమిన్ సి దెబ్బతింటుంది. కాబట్టి నిమ్మరసం కలుపడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్ను బలహీనపరుస్తుంది. ఇది దంతక్షయానికి దారితీస్తుంది. కాబట్టి తేనెతో నిమ్మకాయ నీరు తాగకపోవడమే మంచిది.

తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది.