
చేపల మార్కెట్ లో చేపలను వాటి ఉత్పత్తులను అమ్మే స్థలం. ఇది మత్స్యకారులు, చేపల వ్యాపారుల మధ్య హోల్సేల్ వ్యాపారం జరిగే స్థలం. అంతేకాదు ఇక్కడ కొంతమంది వినియోగదారులు నచ్చిన మెచ్చిన చేపలను కొనుగోలు చేస్తారు కూడా. ఇది హోల్ సెల్ అండ్ రిటైల్ మార్కెట్ అని చెప్పవచ్చు. ఈ చేపల మార్కెట్ ను వెట్ మార్కెట్ ని కూడా చెప్పవచ్చు. అప్పటికప్పుడు నీటిలో దొరకిన చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే మన దేశంలో అతి పెద్ద 7 అతిపెద్ద చేపల మార్కెట్ల గురించి ఈ రోజు తెలుసుకుదాం..

దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్ మహారాష్ట్రలో ఉంది. క్రాఫోర్డ్ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్. ఈ మార్కెట్ ముంబైలోని పురాతన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ మీరు లైవ్ ఫిష్ నుండి ఎండిన చేపలు, రొయ్యలు వంటి అనేక సి ఫుడ్ ని కొనుగోలు చేయవచ్చు.

పుణెలోని ఖేద్షిబాపూర్ మార్కెట్ రెండో స్థానంలో ఉంది. తాజా చేపల కోసం చేపల ప్రియులు ఈ మార్కెట్కు పోటెత్తుతారు. ఈ మార్కెట్ సముద్ర ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందింది.

దేశంలోని మూడవ అతిపెద్ద చేపల మార్కెట్, కోలివాడ ఫిష్ మార్కెట్.. ఇది కూడా మన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని మెషువా గ్రామంలో ఉంది.

హైదరాబాద్లోని మచ్చిబజార్ దేశంలోనే నాల్గవ అతిపెద్ద చేపల మార్కెట్. తాజా చేపల కోసం ఈ మార్కెట్ బాగా ప్రాచుర్యం పొందింది. కొర్ర మేను నుంచి చిన్న చిన్న చేపలు మెత్తల్ల వరకూ అనేక రకాల సీఫుడ్ ఈ మార్కెట్లో లభిస్తాయి.

దేశంలో ఐదవ అతిపెద్ద చేపల మార్కెట్ గోవా లో ఉంది. గోవా రాజధాని పనాజీ చేపల మార్కెట్ ఇప్పటికీ దేశంలో ఐదవ అతిపెద్ద చేపల మార్కెట్గా ఉంది.

దక్షిణాది రాష్ట్రం కేరళ ఆరో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రలో చేపలతో తయరు చేసిన ఆహారాన్ని ఇష్టంగా తినరు. ఇక్కడ చేప ఫుడ్ అభిమానులు ఎక్కువ. కేరళలోని కోజికోడ్ చేపల మార్కెట్ దేశంలోనే ఆరవ అతిపెద్ద చేపల మార్కెట్. ప్రసిద్ధ చెందిన కోరమేను చేప ఇక్కడ కనిపిస్తుంది.

అతిపెద్ద చేపల మార్కెట్ రేసులో కర్ణాటకలోని మల్పే ఫిష్ మార్కెట్ ఏడో స్థానంలో నిలిచింది. ఈ మార్కెట్ మల్పే చేపలకు(మార్పు చేప) ప్రసిద్ధి. చేపల ప్రియులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలను కొనుగోలు చేస్తారు.