
పిండిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే దానిలోని విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయి. ఈ పిండితో తయారు చేసిన చపాతీలు కడుపు నింపుతాయి. కానీ శరీరానికి అవసరమైనంత పోషకాహారం లభించదు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పిండి గది ఉష్ణోగ్రత వద్ద ఉండే పిండి కంటే స్టార్చ్ను త్వరగా చక్కెరగా మారుస్తుంది. ఇలాంటి చపాతీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ ఆహారం మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రమాదకరం.

కాబట్టి వీలైనప్పుడల్లా చపాతీలను తాజాగా చేసిన పిండితో తయారు చేసుకోవాలి. అయితే ఒకసారి కలిపిన పిండిని 24 గంటలకు మించి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడదు. పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే కలిపిన పిండికి బదులుగా పొడి గోదుమ పిండిని నిల్వ చేయడం మంచిది.

రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పిండి ఆరోగ్యానికి హానికరం. రిఫ్రిజిరేటర్లో ఉంచిన పిండి 24 గంటల్లో నిరుపయోగంగా మారుతుంది.ఆ తర్వాత దానిని నివారించాలి. పిండిని చల్లని ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల కిణ్వ ప్రక్రియ ఆగదు. బదులుగా దానిని నెమ్మదింపజేస్తుంది. పిండిలోని ఈస్ట్, బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతల వద్ద మరింత నెమ్మదిగా పనిచేస్తూనే ఉంటాయి. ఇది కాలక్రమేణా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది.

దీంతో ఒకేసారి చాలా చపాలు తయారు చేసుకుని, అవసరమైనప్పుడు వాటిని మళ్లీ వేడి చేసి తింటుంటారు. ఆహారాన్ని మళ్లీ వేడి చేసే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని.. ఆహారాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు అది గట్టిగా మారుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

చపాతీలను మళ్లీ వేడి చేసి తినడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అదే అప్పుడే తయారుచేసిన చపాతీలో తేమ, పోషకాలు అదికంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఈ పోషకాలు తగ్గుతాయి. కాబట్టి రోటీని మళ్లీ వేడి చేసి తినకూడదు.