
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే ..సేమియా అర కేజీ, బాదం పప్పులు అరకేజీ, పాలు లీటర్, చక్కెర వంద గ్రాములు, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, కస్టర్డ్ మిల్స్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పిస్తాపప్పులు.

తయారీ విధానంలోకి వెళితే.. మీరు బాదం సేమియా చేయడానికి ఒక రోజు ముందు రాత్రి బాదం పప్పులను మంచిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత రోజు వాటి పై పొట్టు తొలిగించి, మొత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నెయ్యివేయాలి. తర్వాత ఒకదాని తర్వాత మరొకటి, జీడిపప్పులు, కిస్మిస్, అన్నీ కూడా వేయించుకోవాలి. అవి బంగారు రంగులో వేగిన తర్వాత, సేమియాను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో సరిపడ పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో చక్కెర వేయాలి. తర్వాత సేమియా వేసి ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.

సేమియా ఉడుకుతుండగానే, అందులో యాలకుల పొడి, కిస్మిస్ కుంకుమ పువ్వు, కండెన్డ్స్ మిల్క్ వేసి మంచిగా కలుపుకోవాలి. సేమియా కాస్త దగ్గర పడుతుంది. అప్పుడు మిగిలిన జీడిపప్పు, కిస్మిస్, పిస్తా వేస్తే అంతే. టేస్టీ టేస్టీ రుచికరమైన బాదం సేమియా రెడీ.