
రుచికరమైన మాంసాహార పదార్థాలలో ఈ చేప కూడా ఒకటి. వీటిని మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు, కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఈ చేపల వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ దానిని సరిగ్గా తినడం అనేది పెద్ద టాస్క్ ముఖ్యంగా ఫస్ట్ టైం చేపలు తినేప్పుడు చేప ముల్లు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. పొరపాటు అలా ముల్లు గొంతులో ఇరుక్కుంటే మీరు ఫస్ట్ కంగారు పడొద్దు.

ఒక వేళ మీ గొంతులో చేప ముల్లు ఇరుక్కుంటే మొదట టెన్షన్ పడకండి. మీ ఇంట్లో అరటి పండ్లు ఉన్నాయా లేదా చూడండి. లేకపోతే మార్కెట్కు వెళ్లి మంచిగా పండిన అరటి పండ్లను తీసుకొని ఇంటికొచ్చి అరటి పండు తినండి. ఇలా తినడం ద్వారా అరటి పండుతో సహా మీ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లు కడుపులోకి వెళ్తొంది.. కడుపులో ఉన్న ఆమ్లాలు ఆ ముల్లును నిదానంగా కరిగించి వేస్తాయి.

చేప ముల్లును తొలగించడానికి మరో పద్దతి ఏమిటంటే.. నిమ్మకాయర రసం. మీ గొంతులో చేప ముల్లు ఇరుక్కుంటే నిమ్మకాయపై కొద్దిగా ఉప్పు చల్లి దాని రసాన్ని తాగండి. నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం ముల్లు కడుపులోకి వెళ్లడానికి సహాయపడుతుంది. అలాగే మలాన్ని మృదువుగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈజీగా గొంతులో ఇరుక్కున్న ముల్లును తొలగించవచ్చు

మరో విధంగా కూడా ముల్లును మనం తొలగించవచ్చు. ఇందుకోసం వేడి వేడి అన్నాన్ని చిన్న ఉండలు చేసి నరుగా మింగేయండి. అరటిపండులాగే, అన్నం కూడా ముల్లును కిందకి నెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ భాగం చేప ఎముకలు మీ గొంతు వెనుక భాగంలో, మీ టాన్సిల్స్ చుట్టూ చిక్కుకుంటాయి. కాబట్టి జోరుగా దగ్గడానికి ప్రయత్నించడం ద్వారా బలమైన దగ్గు నుండి ముల్లును బయటకు తీసుకురావచ్చు. ముల్లు తొలగించేందుకు ఇది కూడా ఒక మార్గం.

Note: ఒకవేళ ముల్లు సమస్య నివారణ కాకపోతే, భోజనం చేసేటప్పుడు, గొంతులో లేదా అన్నవాహికలో నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని కలవండి, పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే చేప ముల్లు అలాగే ఉంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ ఎదురుకావచ్చు. ఇంకా ముల్లు గొంతులోని అన్నవాహిక భాగంలో గుచ్చుకుని ఉంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.