Hero Moto Corp: పండగ సీజన్లో వినియోగదారులకు షాకిచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటా కార్ప్. అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై రూ.1000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ధరలు పెంపునకు గల కారణాలను వెల్లడించింది. ముడి సరుకు ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణానికి దారి తీయడంతో పాక్షికంగానైనా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.
ఆయా మోడల్ బైక్ లేదా స్కూటర్ను ధర పెంపు ఖరారవుతుందని హీరో మోటో కార్ప్ స్పష్టం చేసింది. దేశంలోని ద్విచక్ర వాహనాలు మార్కెట్లో హీరో మోటో కార్ప్స్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.
ఎంట్రీ లెవెల్ `హెచ్ఎఫ్ 100 నుంచి ఎక్స్ పల్స్ వరకు ఉన్నాయి. ఆయా బైక్ల ధరలు రూ.55,450 నుంచి రూ.1.36 లక్షల మధ్య ఉన్నాయి.