
వానలు ఓ వైపు విపరీతంగా పడుతున్నాయి. గత వారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వేడిగా ఉండే తినాలని అనిపిస్తుంది అందరికి బయట ఆయిల్ ఫుడ్స్ కంటే ఇలాంటి తాగితే ఎంతో మంచిది . బాగా వర్షాలు పడేటప్పుడు ఈ జావ తప్పక తాగాలి. మరి అదేంటో ఇక్కడ చూద్దాం..

పాతకాలంలో మన పెద్దలు తాగిన రాగి , బియ్యం జావ ఇలా చేసుకుని తాగితే ఆ రుచికి ఫిదా అవుతారు. ఈ సాంప్రదాయ డ్రింక్ శరీరానికి కూడా ఎంతో మంచిది. ఇంకా రోజంతా శక్తిని కూడా ఇస్తుంది. అంతకముందు పొలానికి వెళ్లే రైతులు ఈ జావను తాగి పొలాలకు వెళ్ళి పనులను చూసుకుంటూ వెళ్ళాలి.

రాగి, బియ్యం జావకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు రాగి పిండి, ఇంకా ఒక కప్పు బియ్యం, ఇంకా కనీసం 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి, అలాగే మజ్జిగను కూడా తీసుకోవాలి. ఇంకా రుచికి తగినంత ఉప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఐదు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

రాగి, బియ్యం జావకు తయారి విధానం : ముందుగా రాగి పిండిని తీసుకుని బాగా వేడి చేసి, ఆ తర్వాత బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి ఇంకో పాత్రలో నీటితో మెత్తగా ఉడికించాలి. ఇంకా బియ్యం ఉడికిన తరవాత గంజిని వేరు తీసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ గంజే రాగి బియ్యం జావలో ముఖ్యం. ఆ తరవాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

కొద్దీసేపు ఆగిన తరవాత ఈ గంజిలో రాగి పిండిని కలుపుకుని దీనితో పాటు మజ్జిగ లేదా పెరుగును కలుపుకుని, ఉప్పు, నాలుగు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వాటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు పేస్ట్ కూడా వేస్తె రుచిగా ఉంటుంది.