
ఎండుద్రాక్షలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది, ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది.

ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండుద్రాక్ష తినాలి. ఎండుద్రాక్ష పోషక విలువల పరంగా చాలా గొప్పది.

కిస్మిస్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కిస్మిస్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కిస్మిస్లో ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా బరువు నిర్వహణకు సహాయపడతాయి.

అంతేకాదు..ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును మెయింటెన్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.