
డార్జిలింగ్ను మంచు దుప్పటి కప్పేసింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి.

దీంతో స్నో ఫాల్ను చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున డార్జిలింగ్ చేరుకుంటారు. కరోనా ఆంక్షలు కూడా సడలిస్తుండడంతో పర్యాటలకు తాకిడి పెరుగుతోంది.

ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. డార్జిలింగ్లో శనివారం ఏకంగా -2 డిగ్రీలు నమోదైంది. అలాగే కుర్సియోంగ్లో 4.5 డిగ్రీలు, కాలింపాంగ్లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను సడలించడం కూడా పర్యాటకుల తాకిడి పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్, బార్లను 75 శాతం మందితో నిర్వహించుకోవడానికి అనుమతించారు.

సోమవారం కూడా డార్జింగ్లో హిమపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పర్యాటకులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.