
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఆలయ ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ప్రభుత్వం తరుపున స్వామి వారి కి పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సమర్పించారు.

ప్రభుత్వం తరుపున స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు.

కళ్యాణం అనంతరం కళ్యాణం తిలగించే భక్తులకు ప్రసాదాలు తలంబరాలు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రత్నగిరి కొండపై ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.