భారతదేశం పొరుగున ఉన్న నేపాల్ దాని అందమైన ప్రకృతి రమణీయతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శిస్తారు.
విమాన ప్యాకేజీ: ఈ ప్యాకేజీతో మీరు ఖాట్మండు, పోఖారాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. చండీగఢ్ నుండి ఖాట్మండుకు ప్రత్యేక విమాన ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.
6 రోజులు, 5 రాత్రులు: ఈ ప్యాకేజీ' నవంబర్ 4, 2023న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో మొత్తం 6 పగళ్లు, 5 రాత్రులు ఉంటాయి. ఇందులో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి.
3 స్టార్ హోటళ్లలో వసతి: ఈ ప్యాకేజీలో 3 స్టార్ హోటల్లో వసతి ఉంటుంది. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంటుంది.
ఛార్జీల వివరాలు: ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి మీరు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే.. రూ.50,500, ఇద్దరు వ్యక్తులకు రూ.42,500 ముగ్గురికి రూ.42,100 తగ్గింపుతో లభిస్తుంది.