Health Tips: పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ప్రయోజనకరమే అయినప్పటికీ కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు వికారం, వాంతులు, తలనొప్పి, అలెర్జీ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.
పెరుగు, పండ్లు: చాలా మంది పెరుగుతో పండ్లను కలిపి తీసుకుంటారు. కానీ పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అలెర్జీలు కలుగుతాయి.
పాలు, అరటి: చాలా మంది పాలు, ఆరటిపండ్లను కలిపి మిల్క్ షేక్ చేసి తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. వీటిల్లో క్యేలరీలు ఎక్కువగా ఉన్నందున మీరు త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునేవారు పాలు, అరటి పండ్లను కలిపి తీసుకోకూడదు.
పెరుగు, ముల్లంగి: ముల్లంగి, పెరుగు ఆరోగ్యానికి మంచివే కానీ రెండింటినీ కలిపి తీసుకోవడం మంచిది కాదు. ముల్లంగి కూరతో భోజనం లేదా ముల్లంగి జ్యూస్ తీసుకున్న తర్వాత పెరుగు తింటే జీర్ణ సమస్యలు కలుగుతాయి.
చేప, పాలు: చేపలు తిన్న వెంటనే పాలు తాగితే కడుపుకు హాని కలుగుతుంది. రెండింటిలోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉన్నా.. వీటి స్వభావం విభిన్నం. ఫలితంగా కడుపు నొప్పి కలిగే అవకాశం ఉంది.